Posts

Showing posts from April, 2020

మే దినోత్సవం(May Day)- eastmedia

Image
మే 1 మే దినోత్సవం మే దినోత్సవం లేదా మే డే (May Day) ప్రతి సంవత్సరం మే 1 వ తేదీ న జరుపుకునే స్మారక దినం. ప్రజా శెలవుదినం. చాలా దేశాలలో మే దినం, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా కార్మిక దినోత్సవంతో ఏకీభవిస్తాయి. ఇవి అన్నీ కూడా కార్మికుల పోరాటం, కార్మికుల ఐక్యతను గుర్తిస్తాయి. కొన్ని పురాణగాథలు కొన్ని రోజులను పండుగలుగా మార్చాయి. కొన్ని జాతీయ సంఘటనలు ఆ సమాజానికి పర్వదినాలు అవుతాయి. కొందరు మహనీయులు తమ రక్తాన్ని చిందించి కొన్ని రోజులను చారిత్రాత్మక రోజులుగా మారుస్తారు. మే డే ఒక చారిత్రాత్మక చైతన్య దినం. చికాగోలో వున్న కొంతమంది రక్తతర్పణం చేసి కేవలం తమ దేశంలో వుండే కార్మికవర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారు. ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేమూ మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులుంటాయి. ఈ చాకిరీ మేం చేయలేమని పని ముట్లు కింద పడేసి ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడటం, చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించడం కార్మిక వర్గ పోరాట పటిమకు నిదర్శనం. 24 గంటలలో ఎనిమిది గంటలు పని, ఎనిమిది గంటలు విశ్రాంతి (రెస్టు), ఇంకా ఎనిమిది గంటలు రిక్రీయేషన్‌ అన్నవి ఈ ...

దాదాసాహెబ్ ఫాల్కే(Dhundiraj Govind Phalke)-eastmedia

Image
ఏప్రిల్ 30 దాదాసాహెబ్ ఫాల్కే గారి జననం ధుండీరాజ్ గోవింద్ ఫాల్కే (Dhundiraj Govind Phalke), జనపరిచయ నామం దాదాసాహెబ్ ఫాల్కే (ఏప్రిల్ 30, 1870 - ఫిబ్రవరి 16, 1944) ఒక భారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, స్క్రీన్‌ప్లే-రచయిత, భారతీయ సినిమా పితామహుడు అని కూడా ప్రసిద్ధి.. ఇతడి ప్రథమ సినిమా రాజా హరిశ్చంద్ర (భారతీయ మొదటి సినిమా) 1913. ఇతడు తన జీవితంలో 95 ఫీచర్ ఫిల్మ్ లు, నిర్మించాడు. “ఒక అంకిత స్వభావుడి అరుదైన కృషి, జిజ్ఞాసల ఫలితంగా ఎనిమిది దశాబ్దాల క్రితం భారతదేశంలో చలన చిత్ర రంగం ఆవిష్కారమైనది. వెండి తెరపై భారతీయ దేవుళ్ళను చూడాలనే స్వప్నం కళ్లకెదురుగా కదలాడింది. ఆనాడు బైస్కోపులు అమెరికా, ఇతర నాగరిక పాశ్చాత్య దేశాల నుండి దిగుమతి అయ్యేవి. చెక్కబొమ్మలు చెక్కేవారు. సంగీతం, చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ, మాజిక్, మౌల్డింగ్ వంటి అనేక రంగాలలో ఆరితేరినవాడై స్వాప్నికుడిగా మారిన ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే భారతీయ చలనచిత్ర పితామహుడు కాగలిగాడు. దాదా సాహెబ్ ఫాల్కేగా గణుతికెక్కాడు” బాల్యం ధుండీరాజ్ గోవింద్ ఫాల్కే మహారాష్ట్ర సమీప త్రయంబకేశ్వర్ లో 1870 ఏప్రిల్ 30 న జన్మించాడు. ఫాల్కె తండ్రితో ఉద్యోగ నిమిత్తం ...

అంతర్జాతీయ నృత్య దినోత్సవం(International Dance Day)-eastmedia

Image
ఏప్రిల్ 29 అంతర్జాతీయ నృత్య దినోత్సవం  అంతర్జాతీయ నృత్య దినోత్సవం 1982 లో యునెస్కో సంస్థ అయిన ఎన్.జి.ఓ యొక్క ఇంటర్నేషనల్ డాన్స్ కమిటీ చే ప్రారంభించబడింది. ఈ దినాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 29 న జరుపుకుంటారు. చరిత్ర ఈ రోజున జరుపుకొనాలనే సూచనను ఇంటర్నేషనల్ డాన్స్ కమిటీ యిచ్చింది. 1760 లో ప్రచుచింబడిన ప్రముఖ రచన Lettres sur la daబnse యొక్క రచయిత, ఆధునిక నృత్యనాటికల సృష్టి కర్త అయిన జీన్-నోవెర్రీ (1727-1810) యొక్క జన్మ దినాన్ని పురస్కరించుకొని ఆదినాన్ని అంతర్జాతీయ నృత్య దినంగా ప్రకటించారు ప్రతి సంవత్సరం, ఒక అద్భుతమైన నృత్య దర్శకుడు లేదా నర్తకుడు ప్రపంచవ్యాప్తంగా చెలామణి అయ్యేవారు ఒక సందేశాన్ని అందించటానికి ఆహ్వానించబడతారు. ఇంటర్నేషనల్ డాన్స్ కమిటీ యొక్క ప్రవేశ పత్రం ఆధారంగా ఈ ప్రసిద్ధ నృత్యదర్శకుడు లేదా నర్తకుని ఎంపిక చేయడం జరుతుంది UNESCO నిర్వహించిన అంతర్జాతీయ నృత్య దినోత్సవంలో యిప్పటివరకు పాల్గొన్న, సందేశాన్ని అందించిన ప్రముఖులలో మెర్సీ కన్నింగ్‌హం, మారిస్ బెజర్త్, అక్రం ఖాన్, అన్నే తెరెసా దే కీర్ స్మేకర్ లు. ఈ దినం యొక్క లక్ష్యం నృత్య కళారూపం యొక్క ప్రపంచీకరణను ఛేదించడాని...

రమాకాంత్ దేశాయ్(Ramakant Desai)-eastmedia

Image
ఏప్రిల్ 28 భారత క్రికెట్ జట్టులో ఫాస్ట్ బౌలర్ రమాకాంత్ దేశాయ్ గారి వర్థంతి 1939, జూన్ 20న ముంబాయిలో జన్మించిన రమాకాంత్ దేశాయ్ (Ramakant Bhikaji Desai) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1959లో టెస్ట్ క్రికెట్‌లో ఆరంగేట్రం చేసిన ఇతను ఫాస్ట్ బౌలర్‌గా జట్టుకు సేవలందించాడు.వెస్టిండీస్ తో ఆడిన తొలి టెస్టులోనే 49 ఓవర్లలో 4 వికెట్లు పడగొట్టినాడు. 1959లో ఇంగ్లాండు, 1961-62లో వెస్టీండీస్, 1967-68లో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ లలో పర్యటించిన భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 1960-61లో పాకిస్తాన్ పై జరిగిన సీరీస్‌లో 21 వికెట్లు సాధించాడు. ముంబాయి టెస్టులో 10వ నెంబరు బ్యాట్స్‌మెన్‌గా ప్రవేశించి 85 పరుగులు సాధించాడు. ఇది జాతీయ రికార్డు. అంతేకాకుండా 9 వికెట్టుకు నానా జోషితో కలిసి 149 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించిన తరువాత సెలెక్షన్ కమిటీ చైర్మెన్‌గా బాధ్యతలు చేపట్టినాడు. 1998, ఏప్రిల్ 28న మరణించినారు. టెస్ట్ క్రికెట్ గణాంకాలు రమాకాంత్ దేశాయ్ 28 టెస్టులు ఆడి 37.31 సగటుతో 74 వికెట్లు సాధించాడు. ఇన్నింగ్సులో 5 వికెట్లను రెండు సార్లు పడగొట్టి...

సామ్యూల్ F. B. మోర్స్(Samuel Morse)-eastmedia

Image
ఏప్రిల్ 27 సామ్యూల్ F. B. మోర్స్ జయంతి శామ్యూల్ ఫిన్లీ బ్రీస్ మోర్స్ ( 1791 ఏప్రిల్ 27 - 1872 ఏప్రిల్ 2) అమెరికన్ చిత్రకారుడు, ఆవిష్కర్త . ప్ర్రతికృతి చిత్రకారుడిగా తన ఖ్యాతిని స్థాపించిన తరువాత, తన మధ్య వయస్సులో మోర్స్ యూరోపియన్ టెలిగ్రాఫ్‌ల ఆధారంగా సింగిల్-వైర్ టెలిగ్రాఫ్ వ్యవస్థను కనిపెట్టాడు . అతను మోర్స్ కోడ్ సహ-అభివృద్ధికారుడు, టెలిగ్రాఫీ వాణిజ్య వినియోగాన్ని అభివృద్ధి చేయడానికి దోహదపడ్డాడు. వ్యక్తిగత జీవితం శామ్యూల్ ఎఫ్.బి. మోర్స్ మసాచుసెట్స్‌లోని చార్లెస్టౌన్‌లో పాస్టర్ జెడిడియా మోర్స్ (1761–1826), ఎలిజబెత్ ఆన్ ఫిన్లీ బ్రీస్ (1766-1828) దంపతులకు మొదటి సంతానంగా జన్మించాడు. అతని తండ్రి భౌగోళిక శాస్త్రవేత్త.  అతని తండ్రి కాల్వినిస్ట్ విశ్వాసం గల గొప్ప బోధకుడు, అమెరికన్ ఫెడరలిస్ట్ పార్టీ మద్దతుదారు. ఇది ప్యూరిటన్ సంప్రదాయాలను పరిరక్షించడంలో సహాయపడుతుందని అతను భావించాడు. బ్రిటన్‌, బలమైన కేంద్ర ప్రభుత్వంతో పొత్తుకు ఫెడరలిస్ట్ మద్దతును అతను నమ్మాడు. మోర్స్ తన మొదటి కొడుకు కోసం కాల్వినిస్ట్ సద్గుణాలు, నీతులు, ప్రార్థనల ప్రేరణతో పాటు, ఫెడరలిస్ట్ విధానంలో విద్యను అందించాలని గ...

శ్రీనివాస రామానుజన్(Srinivasa Ramanujan)_eastmedia

Image
ఏప్రిల్ 26 శ్రీనివాస రామానుజన్ గారి వర్దంతి ప్రపంచ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ (డిసెంబర్ 22, 1887—ఏప్రిల్ 26, 1920) భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు. ఇతడికి పది సంవత్సరాల వయసులోనే గణితశాస్త్రంతో అనుభందం ఏర్పడింది. చిన్న వయసులోనే గణితం పట్ల ప్రకృతి సిద్ధమైన ప్రతిభ కనపరిచేవాడు. ఆ వయసులోనే ఎస్ ఎల్ లోనీ త్రికోణమితి మీద రాసిన పుస్తకాలను వంటపట్టించుకున్నాడు. పదమూడు సంవత్సరాలు నిండే సరికల్లా ఆ పుస్తకాన్ని ఔపోసన పట్టడమే కాకుండా తన సొంతంగా సిద్ధాంతాలు కూడా రూపొందించడం ప్రారంభించాడు. బాల్యం రామానుజన్ డిసెంబర్ 22, 1887 నాడు తమిళనాడు రాష్ట్రం లోని ఈరోడ్ పట్టణములో ఆయన అమ్మమ్మ ఇంట్లో జన్మించాడు. రామానుజన్ తండ్రి కె శ్రీనివాస అయ్యంగార్ ఒక చీరల దుకాణంలో గుమస్తాగా పని చేసేవారు. ఈయన తంజావూరు జిల్లాకి చెందిన వారు. తల్లి కోమలటమ్మాళ్ గృహిణి, ఆ ఊరిలోని గుడిలో పాటలు పాడేది. వీరు కుంభకోణం అనే పట్టణంలో, సారంగపాణి వీధిలో, దక్షిణ భారతదేశ సాంప్రదాయ పద్ధతిలో నిర్మించబడ్డ ఒక పెంకుటింట్లో నివాసం ఉండేవారు....

గూగ్లి ఎల్మో మార్కోని(Guglielmo Marconi)_eastmedia

Image
ఏప్రిల్ 25 గూగ్లి ఎల్మో మార్కోని జననం గుగ్లిఎల్మో జియోవన్ని మారియా మార్కోనీ (1874 ఏప్రిల్ 25 - 1937 జూలై 20) ఇటాలియన్ ఆవిష్కర్త, ఎలక్ట్రికల్ ఇంజనీర్. అతను సుదూర ప్రాంతాలకు రేడియో ప్రసారాలు పంపుటకు, రేడియో టెలిగ్రాఫ్ వ్యవస్థను అభివృద్ధి చేయుటలో పితామహుడుగా గుర్తింపు పొందాడు. అతను రేడియో యొక్క ఆవిష్కర్త. 1909 లో కార్ల్ ఫెడ్రినాండ్ బ్రాన్ తో కలసి వైర్‍లెస్ టెలిగ్రాఫీ అనే అంశంపై భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి తీసుకున్నాడు . 1897 లో బ్రిటన్ లో వైర్‍లెస్ టెలిగ్రాఫ్, సిగ్నల్ కంపెనీకి వ్యవస్థాపకునిగా ఉన్నాడు. అతను ఇతర భౌతిక శాస్త్రవేత్తల ప్రయోగాలను ఆధారంగా చేసుకొని రేడియో అనే కొత్త ఆవిష్కరణ చేసి వ్యాపార రంగంలో ఘనమైన విజయాన్ని సాధించాడు. 1929 లో మార్కోనీని మార్చీజ్ అనే అవార్డుతో విక్టర్ ఇమ్మాన్యుయేల్ III గౌరవించాడు. 1931లో అతను పోప్ పియస్ XI కోసం వాటికన్ రేడియోను ఏర్పాటు చేశాడు. రేడియో పరిశోధన యువకునిగా ఉన్న నాటి నుండి మార్కోని విజ్ఞానశాస్త్రం, విద్యుత్ పట్ల ఆసక్తి కలిగి ఉండేవాడు. 1890 ల ప్రారంభంలో, అతను "వైర్‌లెస్ టెలిగ్రాఫీ" అనే ఆలోచనపై పనిచేయడం ప్రారంభించాడు, అంటే ఎలక్ట్రిక...

సచిన్ టెండుల్కర్ జననం(Sachin Tendulkar)_eastmedia

Image
ఏప్రిల్ 24 సచిన్ టెండుల్కర్ జననం ప్రపంచ క్రికెట్ క్రీడా చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన భారతీయ ఆటగాడు సచిన్ రమేష్ టెండుల్కర్ (Sachin Ramesh Tendulkar).క్రికెట్ క్రీడకు భారతదేశంలో అత్యధిక జనాదరణకు కారకుడై, చిన్న పిల్లలు మొదలు ముసలివాళ్ళ మనసులను సైతం దోచుకున్న వర్తమాన క్రికెటర్ టెండుల్కర్ ఏప్రిల్ 24, 1973 న జన్మించాడు. 16-నవంబర్-2013 నాడు తన 40వ ఏట 200వ టెస్ట్ మ్యాచ్ పూర్తి చేసి, అంతర్జాతీయ క్రీడారంగం నుంచి విరమించుకుంటున్న సందర్భంలో భారతప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నను ఈయనకు ప్రకటించింది. ఈ విధంగా ఈ అవార్డును పొందిన ప్రథమ క్రీడాకారునిగా మరో రికార్డు నెలకొల్పాడు సచిన్ టెండూల్కర్. ఈనాడు భారత్ లో ఈ క్రీడకు ఇంత జనాదరణ ఉందంటే అదంతా సచిన్, అతని ఆట తీరు కూడా ఒక కారణం. 1990 దశకంలో భారత క్రికెట్ లో మెరుపులు మెరిపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆటగాడు సచిన్. భారత జట్టుకు ఆపద్భాందవుడిగా ఎన్నో విజయాలు అందజేసిన ఈ ముంబాయికి చెందిన బ్యాట్స్‌మెన్ ను పొగడని వారు లేరనే చెప్పవచ్చు. 2002లో విజ్డెన్ పత్రిక టెస్ట్ క్రికెట్ లో ఆస్ట్రేలియాకు చెందిన డాన్ బ్రాడ్‌మెన్, వన్డే క్రికెట్ లో వెస్ట్‌...

విలియం షేక్‌స్పియర్ వర్దంతి_William Shakespeare_eastmedia

Image
23 ఏప్రిల్ విలియం షేక్‌స్పియర్ వర్దంతి విలియం షేక్‌స్పియర్ ఒక ఆంగ్ల కవి, నాటక రచయిత, నటుడు. ప్రస్తుతము చాలామంది ఇతన్ని గొప్ప ఆంగ్ల రచయితగానూ, ప్రపంచ నాటక రచయితలలో మిన్నైన వానిగానూ గుర్తిస్తున్నారు. ఇతన్ని తరచూ ఇంగ్లాండు జాతీయ కవిగానూ, బార్డ్ ఆఫ్ అవాన్ (కవీశ్వరుడు) గానూ పిలుస్తారు. ఇతని రచనల్లో ప్రస్తుతం 37 నాటకాలు, 154 చతుర్పాద కవితలు (సొన్నెట్ - పద్యాలు), రెండు పెద్ద వ్యాఖ్యాన కవితలు (narrative poems), ఇంకా చాలా ఇతర కవితలు లభిస్తున్నాయి. ఇతని నాటకాలు ప్రపంచంలోని అన్ని ముఖ్య భాషల్లోకీ తర్జుమా చెయ్యబడినాయి, అంతే కాకుండా ఏ ఇతర నాటకాలూ ప్రదర్శించనన్నిసార్లు ప్రదర్శించబడినాయి. షేక్‌స్పియర్ స్ట్రాట్‌ఫోర్డ్-అపాన్-అవాన్ లో జన్మించాడు. ఇక్కడనే పెరిగి పెద్దవాడయినాడు. పద్దెనిమిది సంవత్సరాల వయసులో అన్నే హాథవేను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం, మొదటి కానుపులో సుసాన్నా హాల్ అనే అమ్మాయి, తరువాత కానుపులో హామ్నెట్, జూడిత్ క్వినే అను కవలలు జన్మించారు. రమారమి 1585 - 1592 ల మధ్య కాలంలో స్వంత ఊరినుండి లండన్ వెళ్ళి నటుడు, రచయిత,, చాంబర్లేన్ ప్రభువు మనుషులు) (తరువాతి కాలంలో ఇదే కంప...