గూగ్లి ఎల్మో మార్కోని(Guglielmo Marconi)_eastmedia


ఏప్రిల్ 25
గూగ్లి ఎల్మో మార్కోని జననం
గుగ్లిఎల్మో జియోవన్ని మారియా మార్కోనీ (1874 ఏప్రిల్ 25 - 1937 జూలై 20) ఇటాలియన్ ఆవిష్కర్త, ఎలక్ట్రికల్ ఇంజనీర్. అతను సుదూర ప్రాంతాలకు రేడియో ప్రసారాలు పంపుటకు, రేడియో టెలిగ్రాఫ్ వ్యవస్థను అభివృద్ధి చేయుటలో పితామహుడుగా గుర్తింపు పొందాడు. అతను రేడియో యొక్క ఆవిష్కర్త. 1909 లో కార్ల్ ఫెడ్రినాండ్ బ్రాన్ తో కలసి వైర్‍లెస్ టెలిగ్రాఫీ అనే అంశంపై భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి తీసుకున్నాడు. 1897 లో బ్రిటన్ లో వైర్‍లెస్ టెలిగ్రాఫ్, సిగ్నల్ కంపెనీకి వ్యవస్థాపకునిగా ఉన్నాడు. అతను ఇతర భౌతిక శాస్త్రవేత్తల ప్రయోగాలను ఆధారంగా చేసుకొని రేడియో అనే కొత్త ఆవిష్కరణ చేసి వ్యాపార రంగంలో ఘనమైన విజయాన్ని సాధించాడు. 1929 లో మార్కోనీని మార్చీజ్ అనే అవార్డుతో విక్టర్ ఇమ్మాన్యుయేల్ III గౌరవించాడు. 1931లో అతను పోప్ పియస్ XI కోసం వాటికన్ రేడియోను ఏర్పాటు చేశాడు.
రేడియో పరిశోధన
యువకునిగా ఉన్న నాటి నుండి మార్కోని విజ్ఞానశాస్త్రం, విద్యుత్ పట్ల ఆసక్తి కలిగి ఉండేవాడు. 1890 ల ప్రారంభంలో, అతను "వైర్‌లెస్ టెలిగ్రాఫీ" అనే ఆలోచనపై పనిచేయడం ప్రారంభించాడు, అంటే ఎలక్ట్రిక్ టెలిగ్రాఫ్ ఉపయోగించిన వైర్లను కనెక్ట్ చేయకుండా టెలిగ్రాఫ్ సందేశాలను ప్రసారం చేయడం. ఇది కొత్త ఆలోచన కాదు; అనేక మంది పరిశోధకులు, ఆవిష్కర్తలు వైర్‌లెస్ టెలిగ్రాఫ్ టెక్నాలజీలను, విద్యుత్ ప్రసరణ, విద్యుదయస్కాంత ప్రేరణ , ఆప్టికల్ (లైట్) సిగ్నలింగ్ ఉపయోగించి 50 సంవత్సరాలుగా కొత్త వ్యవస్థలకోసం అన్వేషిస్తున్నారు. కానీ ఎవరూ సాంకేతికంగా, వాణిజ్యపరంగా విజయవంతం కాలేదు. కొత్త అభివృద్ధి హెన్రిచ్ హెర్ట్‌జ్ నుండి వచ్చింది. అతను 1888 లో, విద్యుదయస్కాంత వికిరణాన్ని ఉత్పత్తి చేయగలవచ్చునని, గుర్తించగలమని నిరూపించాడు. అతను విద్యుదయస్కాంత వికిరణాలపై పరిశోధనలు చేసి ప్రస్తుతం ఉన్న రేడియో తరంగాలు (అప్పట్లో వాటిని హెర్టిజియన్ తరంగాలు అని పిలిచేవారు) కనుగొన్నాడు. 1894 లో హెర్ట్జ్ మరణానంతరం అతను పరిశోధనలను కొనసాగించి కొత్త ఆవిష్కరణను సృష్టించింది మార్కోని. అతను హెర్ట్జ్ పరిశోధనలను బొలోగ్నా విశ్వవిద్యాలయం భౌతిక శాస్త్రవేత్త ఆగస్టో రిఘితో కలసి కొనసాగించుటకు అనుమతి లభించింది.
రేడియో టెలిగ్రాఫీని అభివృద్ధి
20 సంవత్సరాల వయస్సులో, మార్కోని రేడియో తరంగాలలో ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు. తన నౌకరు మిగ్నాని సహాయంతో, ఇటలీలోని పోంటెచియోలోని విల్లా గ్రిఫోన్ వద్ద తన ఇంటి అటకపై తన సొంత పరికరాలను నిర్మించాడు. మార్కోని హెర్ట్‌జ్ అసలు ప్రయోగాలను అభివృద్ధి పరిచాడు. రిఘీ సూచన మేరకు, ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త ఎడ్వర్డ్ బ్రాన్లీ 1890 ఫలితాల ఆధారంగా ఒక ప్రారంభ డిటెక్టర్ అయిన కోహరర్‌ను ఉపయోగించడం ప్రారంభించాడు. రేడియో తరంగాలు క్రియాశీలకమైనప్పుడు నిరోధాన్ని మార్చుకొనే లాడ్జ్ చేసిన ప్రయోగాలను ఉపయోగించాడు. 1894 వేసవిలో, అతను బ్యాటరీ, కోహెరర్, ఎలక్ట్రిక్ బెల్‌తో కూడిన తుఫాను అలారంను నిర్మించాడు. మెరుపు ద్వారా ఉత్పన్నమయ్యే రేడియో తరంగాలను ఎంచుకున్నప్పుడు అది ఆగిపోయింది. డిసెంబర్ 1894 లో ఒక రాత్రి మార్కోని తన తల్లికి ఒక రేడియో ట్రాన్సిమిటర్, రిసీవర్‌ను ప్రదర్శించాడు. ఇది ఒక పరికరాల అమరిక. ఒక బెంచ్ మీద టెలిగ్రాఫిక్ బటన్‌ను నొక్కడం ద్వారా గదికి అవతలి వైపు బెల్ రింగ్ చేసింది. తన తండ్రి సహకారంతో, మార్కోని భౌతిక శాస్త్ర సాహిత్యాన్ని చదవడం కొనసాగించాడు. అందులో నుండి రేడియో తరంగాలతో ప్రయోగాలు చేస్తున్న భౌతిక శాస్త్రవేత్తల ఆలోచనలను తీసుకున్నాడు.
అతను పోర్టబుల్ ట్రాన్స్‌మిటర్లు, రిసీవర్ సిస్టమ్స్ వంటి పరికరాలను అభివృద్ధి చేశాడు, అవి ఎక్కువ దూరం పని చేయగలవు. అతని ప్రయోగశాల ప్రయోగం తప్పనిసరిగా ఉపయోగకరమైన కమ్యూనికేషన్ వ్యవస్థగా రూపొందింది.
మార్కోని అనేక భాగాలతో కూడిన పనిచేసే వ్యవస్థలను తయారుచేసాడు.
ఒక సాపేక్షంగా గల సాధారన డోలని (oscillator) లేదా స్ఫులింగము (spark) సృష్టించు రేడియో ప్రసారిణి.
ఒక లోహపు తీగ లేదా భూమి నుండి ఎత్తులో గల గ్రహించే సాధనం
ఒక గ్రాహకం: ఇది బ్రాన్లీ యొక్క అసలు పరికరంగా మార్చబడింది.
ఒక టెలిగ్రాఫ్ కీ: ప్రసరిణి నుండి లఘు స్పందనలను, పెద్ద స్పందనలనూ మోర్స్ కోడ్ ప్రకారం డాట్, డాష్ లుగా పంపుట
మోర్స్ కోడ్ ను నమోదు చేయుటకు టెలిగ్రాఫ్ రిజిస్టర్ ( ఇది కాగితం టేప్ లా ఉంటుంది)
1895 వేసవిలో, మార్కోని తన ప్రయోగాలను బోలోగ్నాలోని తన తండ్రి ఎస్టేట్‌లో ఆరు బయటకు తరలించాడు. అతను యాంటెన్నా యొక్క విభిన్న ఏర్పాట్లు, ఆకృతులను ఉపయోగించి ప్రయత్నించాడు. కాని మెరుగైన విధానంలో కూడా అతను సిగ్నల్స్‌ను ఒక అర మైలు వరకు మాత్రమే ప్రసారం చేయగలిగాడు. ఆలివర్ లాడ్జ్ 1894 లో ఇదే రేడియో తరంగాలకు గరిష్ట ప్రసార దూరం అని ఊహించాడు.
ప్రసార పురోగతి
మార్కోని తన యాంటెన్నా యొక్క ఎత్తును పెంచిన తర్వాత చాలా ఎక్కువ పరిధిని సాధించవచ్చని కనుగొన్నప్పుడు, తీగల టెలిగ్రాఫీలో ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకోని, అతను ట్రాన్స్‌మిటర్, రిసీవర్లను గ్రౌండింగ్ చేయడం.వలన 1895 వేసవిలో ఒక పురోగతి వచ్చింది. ఈ మెరుగుదలలతో, ఈ వ్యవస్థ 2 మైళ్ళు (3.2 కిమీ), కొండల మీదుగా సంకేతాలను ప్రసారం చేయగలిగింది. హెర్ట్‌జ్ ఉపయోగించే డైపోల్ యాంటెన్నాలతో పోలిస్తే, మోనోపోల్ యాంటెన్నా తరంగాల పౌనఃపున్యం తగ్గించింది. ఎక్కువ దూరం ప్రయాణించగల నిలువుగా ధృవణం చెందబడిన రేడియో తరంగాలను ప్రసరింపచేసింది. ఈ సమయంలో, ఈ పరికరానికి అదనపు నిధులు ఖర్చుపెట్టి, పరిశోధనలు చేస్తే ఎక్కువ దూరాన్ని విస్తరించగలదని, వాణిజ్యపరంగా, సైనికపరంగా ఈ వ్యవస్థ విలువైనదని రుజువు చేసాడు. మార్కోని ప్రయోగాత్మక ఉపకరణం మొదటి పూర్తి- ఇంజనీరింగ్, వాణిజ్యపరంగా విజయవంతమైన రేడియో ప్రసార వ్యవస్థగా నిరూపించబడింది. మార్కోని పియెత్రో లకావా నిర్దేశం ప్రకారం నిస్తంత్రీ టెలిగ్రాఫ్ యంత్రం గూర్చి వివరిస్తూ నిధుల కోసం పోస్ట్, టెలిగ్రాఫ్ మంత్రిత్వ శాఖకు రాశాడు. తన లేఖపై ఆయనకు ఎప్పుడూ స్పందన రాలేదు, చివరికి ఆ ప్రతిపాదనను మంత్రి కొట్టివేసాడు,
1896 లో మార్కోనీ ఇటలీని విడిచి ఇంగ్లాండు వెళ్ళేందుకు బోలోగ్నాలోని యునైటెడ్ స్టేట్స్ కాన్సులేట్‌లో గౌరవ కాన్సుల్ అయిన తన స్నేహితుడు కార్లో గార్డినితో మాట్లాడాడు.
గార్డిని లండన్‌లోని ఇటలీ రాయబారి అన్నీబెల్ ఫెర్రెరోకు మార్కోనీ గురించి, అతని అసాధారణ ఆవిష్కరణల గురించి వివరిస్తూ పరిచయ లేఖ రాసాడు. తన ప్రతిస్పందనలో, రాయబారి ఫెర్రెరో పేటెంట్ పొందిన వరకు మార్కోని ఫలితాలను వెల్లడించవద్దని వారికి సలహా ఇచ్చాడు. అతను మార్కోనిని ఇంగ్లాండ్‌లి రమ్మని ప్రోత్సహించాడు. అక్కడ తన ప్రయోగాలను ఆచరణాత్మక ఉపయోగంలోకి మార్చడానికి అవసరమైన నిధులను కనుగొనడం సులభం అని చెప్పాడు. ఇటలీలో తన పరిశోధన పట్ల పెద్దగా ఆసక్తి, ప్రశంసలు లేనందున, మార్కోని 1896 ప్రారంభంలో తన 21 వ ఏట తన తల్లితో కలిసి తన పరిశోధనలకు మద్దతు కోరడానికి లండన్ వెళ్ళాడు. మార్కోని డోవర్ వద్దకు వచ్చాడు. అక్కడ కస్టమ్స్ అధికారి వివిధ ఉపకరణాలను కనుగొనడానికి తన పెట్టెను తెరిచాడు. కస్టమ్స్ అధికారి వెంటనే లండన్‌లోని అడ్మిరల్‌ను సంప్రదించాడు. అక్కడ ఉన్నప్పుడు, మార్కోని బ్రిటిష్ పోస్ట్ ఆఫీస్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ విలియం ప్రీస్ ఆసక్తి, మద్దతును పొందాడు.
ఈ సమయంలో మార్కోని తన వ్యవస్థకు పేటెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అతను 1896 జూన్ న , బ్రిటిష్ పేటెంట్ నంబర్ 12039 తో "ఇంప్రూవ్‌మెంట్ ఇన్ ట్రాన్స్‌మిటింగ్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అండ్ సిగ్నల్స్" అనే శీర్షికతో దరఖాస్తు చేసుకున్నాడు. ఇది రేడియో తరంగ ఆధారిత సమాచార వ్యవస్థలో మొదటి పేటెంట్ అవుతుంది.
-eastmedia
facebook.com

Comments

Popular posts from this blog

పి. పుల్లయ్య(p pullaiah)- eastmedia

త్యాగరాజు(Tyagaraja)-eastmedia